వివాహిత ఆత్మహత్య ఘటనలో మంగళవారం కేసు నమోదైంది. పినపాక మండలం చెందిన మహిళ(30)తో అదే గ్రామానికి చెందిన 1 ప్రవీణ్ బ్లాక్మెయిల్ చేసి శారీరక సంబంధం ఏర్పర్చుకున్నాడు. ఈనెల 5న ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారయత్నం చేయగా ప్రతిఘటించడంతో పారిపోయాడు. మనస్తాపం చెందిన ఆమె పురుగుమందు తాగింది. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందడంతో మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.