అమ్మవారికి బోనాలు సమర్పించిన సిర్పూర్ ఎమ్మెల్యే దంపతులు

55பார்த்தது
ఆషాఢ బోనాల పండుగ సందర్భంగా అమ్మవారికి సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు శివాని దంపతులు ఆదివారం బోనం సమర్పించారు. కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం నుండి ఊరేగింపుగా వెళ్లి సర్ సిల్క్ కాలనీలోని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. బోనాల ఉత్సవ కమిటీ వారు ఎమ్మెల్యే దంపతులను సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి అనుగ్రహంతో పాడి పంటలు సమృద్దిగా పండాలని అమ్మవారిని కోరామన్నారు.