కాగజ్‌నగర్‌ లో పోలీసుల కార్డెన్ సెర్చ్

64பார்த்தது
కాగజ్‌నగర్‌ పట్టణంలోని కాపువాడలో శనివారం ఉదయం కాగజ్నగర్ డిఎస్పి కరుణాకర్, సిఐ శంకరయ్య ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధృవపత్రాలు లేని 100 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను పట్టుకున్నారు. అనంతరం కాగజ్ నగర్ డీఎస్పి ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, వాహనాల నూతన చట్టాలు, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై కాలనీవాసులకు అవగాహన కల్పించారు. కార్డెన్ సర్చ్ లో ముగ్గురు సిఐలు, 10 మంది ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி