ఖమ్మం శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం సాయంత్రం ఎర్రుపాలెం మండల పరిధిలోని పలు గ్రామాలలో పర్యటించి వరదల కారణంగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.