భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య

60பார்த்தது
భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య
భార్య కాపురానికి రావడం లేదని మంచిర్యాల జిల్లాలో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భీమిని మండలానికి చెందిన జంగంపల్లి రాకేష్ ఈనెల 13న నెన్నెల మండలం అత్తగారింటికి వెళ్లాడు. తాగుడుకు బానిసైన రాకేష్ తో గొడవ పెట్టుకుని భార్య పది రోజుల క్రితం పుట్టింటికి వెళ్ళింది. భార్యను తీసుకువెళ్లేందుకు రాకేష్ అత్తగారింటికి వెళ్ళాడు. తాగుడు మానితేనే ఇంటికి వస్తానని భార్య చెప్పడంతో మనస్థాపానికి గురైన రాకేష్ గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

தொடர்புடைய செய்தி