దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అరుణాచల్ప్రదేశ్, త్రిపుర, పశ్చిమబెంగాల్, సిక్కిం, గుజరాత్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో 4వ తేదీ వరకు రెడ్ అలర్ట్ అమల్లో ఉంటుందని తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ సోమవారం వెల్లడించింది. ఇక హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, యుపి, రాజస్థాన్, బీహార్, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా తదితర రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.