బీహార్ లో సీపీఐ నేతను కాల్చి చంపిన దుండగులు

82பார்த்தது
బీహార్ లో సీపీఐ నేతను కాల్చి చంపిన దుండగులు
బీహార్‌లోని అర్వాల్ జిల్లాలో సీపీఐ(ఎంఎల్) నేత సునీల్ చంద్రవంశీ (52)పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. చంద్రవంశీ మార్కెట్ నుండి తన ఇంటికి వెళుతుండగా, బైక్‌పై వచ్చిన దుండగులు అతన్ని అడ్డుకుని, తుపాకీతో కాల్చిచంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, సునీల్ చంద్రవంశీని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

தொடர்புடைய செய்தி