గోవుల స్మగ్లర్ అనుకుని 19 ఏళ్ల విద్యార్థిని 30 కి.మీ వెంబడించి కాల్చి చంపిన గోసంరక్షకులు

70பார்த்தது
గోవుల స్మగ్లర్ అనుకుని 19 ఏళ్ల విద్యార్థిని 30 కి.మీ వెంబడించి కాల్చి చంపిన గోసంరక్షకులు
పశువుల స్మగ్లర్ అని భావించి ఆగస్టు 23న హరియాణలోని ఫరీదాబాద్లో విద్యార్థులపై గో సంరక్షకులు కాల్పులు జరపడంతో 12వ తరగతి చదివే 19 ఏళ్ల ఆర్యన్ మిశ్రా చనిపోయాడని పోలీసులు తెలిపారు. బాధితుడు ఆర్యన్, అతని స్నేహితులు ప్రయాణిస్తున్న కారును దిల్లీ-ఆగ్రా హైవేపై దాదాపు 30 కిమీ మేర నిందితులు వెంబడించారు. ఐదుగురు గోసంరక్షకులను అరెస్టు చేశామని పోలీసులు తాజాగా వెల్లడించడంతో ఈ ఘటన వెలుగు చూసింది.

தொடர்புடைய செய்தி