క్రీడల్లో గెలుపోటములు సహజమని, వాటిని పరిగణలోకి తీసుకోకుండా క్రీడాకారులు క్రీడల్లో రాణించాలని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం అంకాపూర్ లో నిర్వహించిన వాలీబాల్, కబడ్డీ పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ఆదివారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు.