ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించండి: సీతక్క

58பார்த்தது
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణకు ఒక అవకాశం ఇస్తే జిల్లా సమస్యలపై పార్లమెంట్లో పోరాడుతుందని రాష్ట్ర మంత్రి సీతక్క పేర్కొన్నారు. సోమవారం భీంపూర్ మండలంలో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆమెకు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ హామీలను వివరిస్తూ సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నాయకులు ఆడే గజేందర్, నరేష్ జాదవ్, భోజరెడ్డి ఉన్నారు.