తనిఖీల్లో నగదు పట్టివేత

68பார்த்தது
తనిఖీల్లో నగదు పట్టివేత
ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ. 98, 600 నగదును మావల పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. మావల బైపాస్ వద్ద తనిఖీల సందర్భంగా ఇంద్రవెల్లి చెందిన కల్లూరి అశ్విన్ ను తనిఖీ చేయగా ఈ మేరకు నగదు బయటపడినట్లు తెలిపారు. రూ. 50 వేలకు పైగా నగదు తీసుకెళ్లేటప్పుడు దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు దగ్గర ఉంచుకోవాలని లేనట్లయితే స్వాధీనం చేసుకుంటామని మావల ఎస్సై వంగ విష్ణువర్ధన్ వెల్లడించారు.