హైదరాబాద్ గుడిమల్కాపూర్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పీవీ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 65 వద్ద రోడ్డు పక్కన వ్యాపారం చేసే సనావుల్లా(24) వద్దకు ఇద్దరు దుండగులు వచ్చి మొబైల్ ఇవ్వాలని.. లాక్కునేందుకు ప్రయత్నించారు. ప్రతిఘటించిన సనావుల్లాను కత్తితో ఛాతిపై పొడిచి మొబైల్ తీసుకొని బైక్పై పరారయ్యారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.