ఉడుముని వేటాడి సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసిన యువకుడిపై కేసు నమోదు

66பார்த்தது
ఉడుముని వేటాడి సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసిన యువకుడిపై కేసు నమోదు
ఉడుముని వేటాడి సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసిన యువకుడిపై కేసు నమోదైంది. నిర్మల్ జిల్లాలోని కడెం పెద్దూర్ అటవీ రేంజ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. సదరు వ్యక్తి తన పొలంలో ఓ ఉడుమును చంపి, దాని మాంసంతో విందు చేసుకుంటానంటూ ఇన్‌స్టాగ్రామ్ లో వీడియో పోస్టు చేశాడు. వీడియో వైరల్ కావడంతో దీనిపై ఓ జంతు ప్రేమికుడు జిల్లా అటవీ శాఖ అధికారి (డీఎస్ఓ) నాగిని భానుకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నామని డీఎస్ఓ తెలిపారు.

தொடர்புடைய செய்தி