కనిగిరి: పేకాట శిబిరంపై దాడి.. ఏడు మంది అరెస్ట్

83பார்த்தது
కనిగిరి: పేకాట శిబిరంపై దాడి.. ఏడు మంది అరెస్ట్
కనిగిరి మండలం మాచవరం గ్రామ సమీపంలోని పొగాకు బ్యారన్ వద్ద పేకాట ఆడుతున్న ఏడు మందిని అరెస్టు చేసినట్లుగా కనిగిరి సీఐ ఖాజావలి తెలిపారు. సోమవారం రాత్రి పేకాట ఆడుతుండగా సమాచారం అందుకుని పేకాట శిబిరంపై దాడి చేసి రూ. 39, 530 నగదును స్వాధీనం చేసుకున్నామని, నిందితులను పోలీస్ స్టేషన్ కు తరలించామని పేర్కొన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி