సబ్ జైల్ ను సందర్శించిన వినుకొండ ఎమ్మెల్యే

74பார்த்தது
సబ్ జైల్ ను సందర్శించిన వినుకొండ ఎమ్మెల్యే
ఖైదీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా వినుకొండలోని సబ్ జైల్ ను బుధవారం ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సందర్శించారు. ఈ సందర్భంగా మహిళా ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఖైదీలకు అందించే మెనూ, తీసుకుంటున్న జాగ్రత్తలు, జైలులో పాటిస్తున్న పరిశుభ్రత, భద్రత అంశాలపై ఆరా తీశారు. అనంతరం ఖైదీలకు పండ్లను పంపిణీ చేశారు.

தொடர்புடைய செய்தி