ములుకుదురులో పొలం పిలుస్తుంది కార్యక్రమం

67பார்த்தது
ములుకుదురులో పొలం పిలుస్తుంది కార్యక్రమం
పొన్నూరు మండలం ములుకుదురు గ్రామంలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో రైతు విభాగ కార్యదర్శి బోర్రు రామారావు మాట్లాడుతూ వరి పైరు పొట్ట దశలో ఉన్నప్పుడు 20 నుంచి 25 కేజీల పొటాష్ తో పాటు 30 కేజీల యూరియాను కలిపి చల్లాలని సూచించారు. రైతులు యాజమాన్య పద్ధతిని పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చని ఏవో డేగల వెంకట్రామయ్య సూచించారు. గ్రామ రైతులు, ఆర్ బి కే సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி