కొల్లిపరలో 8 మంది జూదరులు అరెస్ట్

50பார்த்தது
కొల్లిపరలో 8 మంది జూదరులు అరెస్ట్
కొల్లిపర మండల కేంద్రమైన కొల్లిపరలోని పొలాల్లో ఓ భవనంలో రహస్యంగా పేకాటాడుతున్న 8 మందిని ఎస్ఐ పి. కోటేశ్వరరావు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందితుల వద్ద నుంచి రూ. 15, 220ల నగదు, 4 బైక్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వారి వెంట నాగరాజు, తాతారావు ఉన్నారు.

தொடர்புடைய செய்தி