మొక్కలు నాటిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

53பார்த்தது
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కేఎస్ పల్లి గ్రామంలో శుక్రవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమానికి గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

தொடர்புடைய செய்தி