ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్కు రాష్ట్ర ప్లానింగ్ సొసైటీ సీఈవోగా ఏపీ ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎఫ్ఎస్ఎస్ సీఈవో వి.సునీల్కుమార్రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. సీఎఫ్ఎస్ఎస్ బాధ్యతలను ఆర్థికశాఖ కార్యదర్శి వినయ్ చంద్కు అప్పగించింది.