వినుకొండ: ప్రజలు అప్రమత్తంగా ఉండండి: ఎమ్మెల్యే

అల్పపీడన ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంగళవారం వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సూచించారు. వినుకొండ పట్టణంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలన్నారు. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సేవలు అందించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు.

தொடர்புடைய செய்தி