21 కేజీల గంజాయి పట్టివేత

గంజాయిని ఆటోలు అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు నిందితులను టంగుటూరు టోల్ గెట్ వద్ద పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుండి రూ. 11 లక్షలు విలువచేసే 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ హాజరతయ్య మాట్లాడుతూ గంజాయి అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ నిందితులు మైసూరుకు చెందిన వారిగా గుర్తించామన్నారు. నిందితులను కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி