హనుమకొండ జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం హనుమకొండ జిల్లా అధ్యక్షులు, వారి బృందం లోక్సభ ఎన్నికల సందర్భంగా ఓటరు అవగాహనపై రూపొందించిన కరపత్రాన్ని మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆవిష్కరించారు. జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా జిల్లా అధికార యంత్రాంగం విస్తృతంగా వివిధ స్వీప్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు.