ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్ రెడ్డిని గెలిపించాలి

50பார்த்தது
ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్ రెడ్డిని గెలిపించాలి
వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎన్నికలలో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. శనివారం పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తి మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ పట్టభద్రులు ఓటు హక్కును ఉపయోగించుకోవాలన్నారు.