విద్యుత్ షాక్ తో ఐదు ఆవులు మృతి

72பார்த்தது
విద్యుత్ షాక్ తో ఐదు ఆవులు మృతి
జయశంకర్ జిల్లా మలహర్ రావు మండలంలోని కొండంపేట గ్రామపంచాయతీలో గురువారం తెప్పెల మధుసూదన్ అనే రైతుకు చెందిన ఐదు పాడి జెర్సీ ఆవులు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాయి. మేతకు వెళ్లిన ఆవులు నేలపై వున్న విద్యుత్ వైరుకు తగలడం తో అక్కడికి అక్కడే మృతిచెందాయని గ్రామస్తులు తెలిపారు. రూ. 3 లక్షలతో ఆవులుకొని రైతు పాలకేంద్రం పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నాడు. బాధిత రైతును ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.