మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఇంటి గోడ కూలి ఏడుగురు మృతి

73பார்த்தது
మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం జరిగింది. దతియాలోని ఖల్కాపురా ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఓ ఇంటి గోడ కూలింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను తొలగించి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.