సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని మాలపల్లి, కుచనపల్లి, పందిళ్ళ, పొట్లపల్లి గ్రామాలలో బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంక చందు మంగళవారం అందించారు. అనంతరం మాట్లాడుతూ. అత్యవసర సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఉపయోగపడుతాయని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.