రాయిపల్లి మార్గంలో బస్సుల పునరుద్ధరణ

68பார்த்தது
రాయిపల్లి మార్గంలో బస్సుల పునరుద్ధరణ
జహీరాబాద్ నుంచి రాయిపల్లి మెదక్ మార్గంలో రద్దు చేసిన బస్సులను పునరుద్ధరించినట్లు డిఎం జాకీర్ హుస్సేన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వంతెనపై నీరు ప్రవహించి రాయిపల్లి రోడ్డు కోతకు గురి కావడంతో బస్సులు తాత్కాలికంగా రద్దు చేసినట్లు చెప్పారు. రోడ్డుకు మరమ్మత్తులు చేయడంతో మళ్ళీ బస్సులు పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు.