తహసిల్దార్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ తరఫున

53பார்த்தது
అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి తహసిల్దార్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. ఒక్క మంత్రి ఒక్కో విధంగా రుణమాఫీ పై మాట్లాడుతున్నారని ఆరోపించారు. ధర్నాలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.