రతన్ టాటా ఒక ఛాంపియన్: నెతన్యాహు

50பார்த்தது
రతన్ టాటా ఒక ఛాంపియన్: నెతన్యాహు
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా మృతికి ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు సంతాపం తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్‌ పెట్టారు. ‘‘నేను, ఇజ్రాయెల్‌లోని అనేక మంది ప్రజలు రతన్‌ టాటా మృతికి సంతాపం తెలుపుతున్నాం. ఆయన భారత్‌ గర్వించదగ్గ ముద్దుబిడ్డ. ఇరు దేశాల స్నేహబంధంలో ఆయనొక ఛాంపియన్‌. రతన్‌ కుటుంబానికి నా సంతాపం తెలియజేయండి’’ అని ప్రధాని మోదీని నెతన్యాహు కోరారు.