నిజామాబాద్ నగరం ఎల్లమ్మ గుట్ట ప్రాంతంలోని విశ్వతేజస్ శిక్షణ కార్యాలయంలో అబ్దుల్ కలామ్ 5 వర్ధంతి సందర్భంగా సోమవారం వైబ్రెంట్స్ ఆఫ్ కలామ్ మరియు విశ్వతేజస్ సంస్థల సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. విశ్వతేజస్ వ్యవస్థాపకులు తిరునగరి శ్రీహరి మాట్లాడుతూ... కలామ్ కలలుగన్న భారతావనిని నిర్మింపజేయడమే సంస్థ ఉద్దేశమని, వ్యక్తిగత క్రమశిక్షనే నిజమైన దేశభక్తి అని ఆయన అన్నారు. కలామ్ వర్ధంతి సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కోవిడ్ దృష్ట్యా ఆన్ లైన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైబ్రెంట్స్ ఆఫ్ కలామ్ జిల్లా సమన్వయ కర్త తక్కురి హన్మాండ్లు, పెందోటి చంద్రశేఖర్, సతీష్, మైత్రి గంగాధర్, ఆదిత్య,శేఖర్, నరహరి నాయక్ తదితరులు పాల్గొన్నారు.