బోధన్ పట్టణంలోని మారుతీ మందిరం వద్ద నేడు గురువారం నిర్వహించే ఎడ్ల పొలాల అమావాస్య వేడుకలకు ప్రజలు, భక్తులు, రైతులు భారీ సంఖ్యలో వచ్చి జయప్రదం చేయవలసిందిగా కార్యనిర్వహణ అధికారి, ఆలయ అర్చకులు కోరారు. వేడుకలను చేపట్టడానికి ఆలయం వద్ద అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు. పాడి రైతులు తమ తమ ఎడ్లను సుందరంగా తీర్చి దిద్ది ఆలయం వద్దకు రావాల్సిందిగా కోరారు.