విద్యార్థులకు విలువలతో కూడిన బోధన అందించండి: కలెక్టర్

83பார்த்தது
విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో గురుపూజోత్సవ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు బోర్డుపై రాయించాలని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సంజీవరెడ్డి అధికారులు పాల్గొన్నారు.