నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని కరీంనగర్ లో కేంద్రమంత్రి బండి సంజయ్ ఇంటిని ముట్టడించిన విద్యార్థి, యువజన నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఈదునూరి అభినవ్ అన్నారు. ఆదివారం మంచిర్యాలలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని ఆరోపించారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.