ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వడ్ల బస్తాల తూకంలో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నారు. రైతుల వద్ద ఖచ్చితంగా 41 కిలోలు మాత్రమే తూకం వేయాలని, కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే రశీదు ఇవ్వాలని తెలిపారు. కొనుగోలు
చేసిన ధాన్యానికి రశీదు ఇవ్వకుంటే ఫిర్యాదు చేయాలని ఆయన రైతులను కోరారు. కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నట్లు వెల్లడించారు.