పాఠశాల భవన నిర్మాణ భూముల పరిశీలన

64பார்த்தது
నర్వ మండలం రాంపూర్ గ్రామంలో జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల మరియు కళాశాల నిర్మాణానికి కేటాయించిన భూములను గురువారం తహసీల్దార్ మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. ఇటీవల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సర్వే నంబర్ 330 లో భూమిని కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో టెండర్లను ఖరారు చేసి భవనాల నిర్మాణాలను ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி