జేఎల్ఎంకు విద్యుదాఘాతం

59பார்த்தது
జేఎల్ఎంకు విద్యుదాఘాతం
పాల్వంచ మండలంలోని నాగారం సబ్ స్టేషన్ కేంద్రంలో పనిచేసే జూనియర్ లైన్మెన్ నీరుడు రామకృష్ణ బుధవారం విద్యుదాఘాతానికి గురయ్యారు. గ్రామంలో విద్యుత్ అంతరాయం కలిగింది. మరమ్మతులు నిర్వహిస్తుండగా విద్యుత్తు ప్రసారమై తీవ్రంగా గాయపడ్డారు. ఏఈ రవీందర్ మాట్లాడుతూ ఎల్సీ ఇవ్వక ముందే స్తంభం ఎక్కడంతో రామకృష్ణ ప్రమాదానికి గురైనట్లు చెప్పారు. మెరుగైన వైద్యం కోసం ఆయన్ను హైదరాబాద్లోని ఆసుపత్రికి పంపించినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி