విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేత

80பார்த்தது
విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేత
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మంగళవారం తల్లిదండ్రుల సమావేశానికి డీఈవో రాజు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరానికి సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమిష్టి కృషి చేయాలని సూచించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.