విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి: ఎమ్మెల్యే

58பார்த்தது
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి: ఎమ్మెల్యే
విద్యార్థులకు నాణ్యమైన విద్యను, భోజనం అందించాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు బుధవారం అన్నారు. మండలంలోని టీటీ దొడ్డి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే విజయుడు అకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని ప్రతి తరగతి గదిని సందర్శించి విద్యార్థుల సామర్ధ్యాలను పరీక్షించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు పౌష్టిక ఆహారంతో కూడిన మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.

தொடர்புடைய செய்தி