వర్షం కారణంగా సీఎం రేవంత్ టూర్ రద్దు అయింది. ఇవాళ కరీంనగర్ లోని SRR గ్రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన జనగర్జన సభలో ప్రసంగించనుండగా.. ఇవాళ ఒక్కసారిగా భారీ వర్షం పడింది. వర్షానికి సభలో టెంట్లు కూలాయి. దీంతో సీఎం రేవంత్ పర్యటన రద్దు అయింది. అయితే సీఎం వరంగల్ పర్యటన కొనసాగనుంది. అయితే యథావిధిగా వరంగల్ రోడ్ షోలో పాల్గొననున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుండి రోడ్డు మార్గాన వరంగల్ కు సీఎం బయల్దేరారు.