అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వినతి

76பார்த்தது
అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వినతి
పదవీ విరమణ పొందిన అంగన్వాడీ కార్యకర్తలకు రూ. 2 లక్షలు, ఆయాలకు రూ. ఒక లక్ష చెల్లిస్తామని ప్రకటించిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలని అంగన్వాడీల సంఘం (టీఎన్జీఓ అనుబంధం) కోరింది. ఈ మేరకు రాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ నేరెళ్ల శారదను ఆదిలాబాద్ లోని పెన్ గంగా భవన్ లో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. పింఛను సైతం రూ. 5 వేలు, రూ. 3 వేలు చెల్లించాలని కోరారు. సంఘం అధ్యక్షురాలు రాధ, కార్యదర్శి కవిత, తదితరులున్నారు.

தொடர்புடைய செய்தி