Feb 23, 2025, 02:02 IST/
నేడు యాదగిరిగుట్టకు సీఎం రేవంత్
Feb 23, 2025, 02:02 IST
TS: సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు. యాదగిరిగుట్టలో నేడు స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ జరగనుంది. ఈ క్రమంలో స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.