ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాలువపల్లి గ్రామ సమీపంలోని డంపింగ్ యార్డ్ వద్ద శనివారం వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. విచారణలో వెంకటేశ్వర్లు గత కొద్దిగ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు పోలీసులకు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.