9వ తరగతి విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో 9వ తరగతి విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటు చేసుకుంది. రొంపిచర్ల మండలం వడ్లమూడివారిపాలెం గ్రామానికి చెందిన పల్లపు జయలక్ష్మి నరసరావుపేట పట్టణం హార్డ్ హైస్కూల్ లో 9వ తరగతి చదువుతుంది. విద్యార్థిని ఇవాళ వసతిగృహంలో ఉరేసుకుని ఆత్మహత్యకు చేసుకుంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.