నిలిచిన వాహనాల రాకపోకలు

82பார்த்தது
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా గురజాల, దాచేపల్లి మండలాల్లోని పలు గ్రామాలకు వెళ్లే రహదారులు మొత్తం జలమయమయ్యాయి. దాచేపల్లి మండలంలోని కేసానపల్లి రోడ్డు, గురజాల మండలం మాడుగుల నుంచి అంజనాపురం వెళ్లే రోడ్డు మధ్యలో ఎద్దుల వాగు ప్రవాహం ఎక్కువై నీరు రోడ్డుపై రావడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలకు శనివారం అంతరాయం. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.