చెకుముకి సైన్స్ పోటీలలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులు

54பார்த்தது
చెకుముకి సైన్స్ పోటీలలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులు
కొరిశపాడు మండలం, మేదరమెట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన, మండల స్థాయి చెకుముకి పోటీలలో, స్థానిక రాధాస్ గీతం హైస్కూల్ విద్యార్థులు ప్రథమ స్థానం సాధించారు. ఈ సందర్భంగా, పాఠశాల ప్రిన్సిపాల్ రాధా కృష్ణ కుమారి పోటీలలో విజయం సాధించి, జిల్లాస్థాయి పోటీలకు అర్హత సాధించిన, విద్యార్థినులు సింధు రెడ్డి, మనో ప్రసన్న, దేదీప్య అంజలిలను అభినందించారు. జిల్లా స్థాయిలో కూడా గెలుపొందలని ఆకాంక్షించారు.