సమర్ధవంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించాలని పట్టభద్రుల ఎంఎల్సి ఉప ఎన్నికల ఏఆర్ఓ, జిల్లా రెవెన్యూ అధికారి కె. శ్రీనివాస్ అన్నారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ నేపద్యం లో ఎల్బి కళాశాలలో పీఓలు, ఏపీఓలకు, ఓపిఓ లకు నిర్వహిస్తున్న శిక్షణ ను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఉప ఎన్నికల నిర్వహణ, పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ విధానంలో పాత్ర కీలకంగా ఉంటుందన్నారు.