నష్టపోయిన పంటలను మంత్రి చూడకపోవడం అన్యాయం: ఎమ్మెల్యే

80பார்த்தது
నష్టపోయిన పంటలను మంత్రి చూడకపోవడం అన్యాయం: ఎమ్మెల్యే
భారీ వర్షాల వల్ల జహీరాబాద్ నియోజకవర్గంలో నష్టపోయిన పంటలను మంత్రి చూడకపోవడం అన్యాయమని ఎమ్మెల్యే మాణిక్ రావు విమర్శించారు. న్యాల్కల్ మండలంలో నష్టపోయిన పంటలను మంగళవారం పరిశీలించారు. మండలంలో అల్లం, చెరుకు, కంది, పెసర, మొక్కజొన్న పంటలకు నష్టం జరిగిందని చెప్పారు. మంత్రి స్పందించి రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఏస్ చైర్మన్ శివకుమార్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி