ఝరి(బి) ఘటనలో 13 మందిపై కేసు నమోదు

65பார்த்தது
ఝరి(బి) ఘటనలో 13 మందిపై కేసు నమోదు
తానూరు మండలం ఝరి(బి) గ్రామంలో జరిగిన రాళ్ల దాడి ఘటనకు సంబంధించిన ఘటనలో ఇరువర్గాల నుండి 13 మందిని అరెస్ట్ చేసినట్లు ఆదివారం పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి గణేశ్ విగ్రహం వద్ద హారతి చేస్తున్న క్రమంలో మండపంపై వచ్చిపడిన రాళ్లతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఇరువర్గాల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

தொடர்புடைய செய்தி