మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో గురువారం ఉగాది వేడుకలను యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సరస్వతి దేవికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆచార్య శ్రీనివాస్ మాట్లాడుతూ.. యూనివర్సిటీ పరిధిలో విశ్వావసు నామ సంవత్సరంలో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి యూనివర్సిటీకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.