ఆత్మకూరులో రికార్డు ధర పలికిన గణేశ్ లడ్డూ

51பார்த்தது
వనపర్తి జిల్లా ఆత్మకూరులో ఏర్పాటు చేసిన గణేశ్ లడ్డూ వేలం రికార్డు సృష్టించింది. స్థానిక బీసీ కాలనీలో ఏర్పాటు చేసిన గణపతికి 14రోజుల పాటు పూజలు వైభవంగా జరిగాయి. శుక్రవారం నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన వేలంలో లడ్డూ రూ. 4. 60లక్షల ధర పలికి రికార్డు సృష్టించింది. దీనిని మాజీ వార్డు సభ్యుడు గడ్డమీది శ్రీనివాసులు దక్కించుకున్నారు. ఈ వేలం వనపర్తి జిల్లాలోనే రికార్డు నెలకొల్పిందని స్థానికులు తెలిపారు.

தொடர்புடைய செய்தி